• Login / Register
  • హోమ్

    యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు

    యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు

     హైదరాబాద్‌, విశాఖ సమాచారం: సీనియర్‌ జర్నలిస్‌, సాక్షి టీవీ యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావును సోమవారం ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అమరావతి మహిళలను కించపరిచిన కేసులో ఆయన్ను అరెస్టు చేశారు. హైదరాబాద్‌ జర్నలిస్టు కాలనీలోని ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఏపీకి తీసుకువెళ్తున్నారు. కొమ్మినేనిపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. సాక్షి టీవీ ఛానెల్‌లో చర్చ సందర్భంగా అసభ్య వ్యాఖ్యల అంశంలో రాజధాని రైతులు, మహిళలు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కంభంపాటి శిరీష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అమరావతిలో ఉన్న తాడికొండ ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గంలోని దళిత మహిళలను అవమానించారన్న ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు తెలుస్తోంది. కొమ్మినేనితోపాటు జర్నలిస్ట్‌ కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యంపైనా కేసు నమోదు చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో విజయవాడ అయోధ్యనగర్‌ కాలనీలోని ఇంటికి తాళం వేసి కృష్ణం రాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన్ను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.
    కాగా,  ఇంటి వద్ద అరెస్ట్‌ చేసేందుకు వచ్చిన ఏపీ పోలీసుల్ని కొమ్మినేని శ్రీనివాసరావు   ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారని ప్రశ్నించారు. ముందస్తు నోటీసులు ఇచ్చారా? లోకల్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారా?. అని అడిగారు. అందుకు ఏపీ పోలీసులు నోరు మెదపలేదు. కానీ అరెస్ట్‌ అనంతరం జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ తీసుకు వెళ్లారు.  కొమ్మినేనిని అరెస్ట్‌ చేసి ఏపీకి తీసుకెళ్తున్నామని జూబ్లీహిల్స్‌ పోలీసులకు తుళ్లూరు పోలీసులు సమాచారం ఇచ్చారు. అనంతరం, కొమ్మినేనిని ఏపీకి తరలించారు. 

    ఒక సీనియర్‌ జర్నలిస్టుకే ఇలాంటి పరిస్థితా? కొమ్మినేని
    ఏపీ పోలీసుల అక్రమ అరెస్ట్‌పై కొమ్మినేని శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను సీనియర్‌ సిటిజన్‌ని.. ఎలా అరెస్ట్‌ చేస్తారు? సీనియర్‌ జర్నలిస్ట్‌ ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితేంటి?. కేసు ఎవరు పెట్టారో చెప్పడం లేదు. సాక్షిలో నా డిబేట్‌లు రాకుండా చేయాలని చూస్తున్నారేమో. ప్రభుత్వ వ్యతిరేకత వాయిస్‌ వినిపించకుండా చేసే యత్నం’ జరుగుతోందన్నారు.
     మరోవైపు, ఇటీవల అమరావతి మహిళల విషయమై జర్నలిస్ట్‌, విశ్లేషకులు కృష్ణం రాజు వ్యాఖ్యల్ని సాక్షి యాజమాన్యం ఇప్పటికే ఖండిరచింది. కొమ్మినేని శ్రీనివాసరావు సైతం ఆ వ్యాఖ్యల్ని ఖండిరచారు.  అమరావతి మహిళలకు క్షమాపణలు కూడా చెప్పారు.   సాక్షి టీవీ డిబేట్‌లో విశ్లేషకుడు కృష్ణంరాజు వ్యాఖ్యలతో తనకు  సంబంధం లేదని కొమ్మినేని  చెప్పారు.

    Leave A Comment