భూవివాదాల పరిష్కారానికి నక్షా కార్యక్రమం: మంత్రి నారాయణ
భూవివాదాల పరిష్కారానికి నక్షా కార్యక్రమం: మంత్రి నారాయణ
అమరావతి: రెవెన్యూ రికార్డుల అమలు, భూవివాదాల పరిష్కారానికి నక్షా కార్యక్రమం నిర్వహించున్నట్లు ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. భూరికార్డుల డిజిటలైజేషన్పై నిర్వహించిన జాతీయస్థాయి కార్యశాలలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి మంత్రి నారాయణ పాల్గొన్నారు. పట్టణాల్లో పారదర్శక, సమర్థ పాలన కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘‘పైలట్ ప్రాజెక్టు కింద దేశంలోని 152 మున్సిపాలిటీల్లో భూసర్వే చేస్తారు. ఏపీలో 10 మున్సిపాలిటీలు ఎంపికయ్యాయి. 9.5 లక్షల ఆస్తులను సర్వే చేసి డిజిటలైజేషన్ చేస్తారు. ఇప్పటికే 8 మున్సిపాలిటీల్లో ఏరియల్ సర్వే పూర్తయింది. నక్షా పూర్తయితే ఆస్తుల వివాదాలకు చెక్ పెట్టొచ్చు’’అని మంత్రి నారాయణ అన్నారు.
Leave A Comment