• Login / Register
  • హోమ్

    ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం

    ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 
    ఆరుగురి దుర్మరణం
     
     గిద్దలూరు, విశాఖసమాచారం : ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం  జరిగింది. లారీ, కారు ఢీకొన్నాయి.   కారులో 8 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు పిల్లలు  గాయపడ్డారు. మృతులను బాపట్ల జిల్లా స్టూవర్టుపురం వాసులుగా గుర్తించారు. వీరంతా మహానంది పుణ్యక్షేత్రంలో దర్శనం చేసుకొని  తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.  పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటికి తీశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.

    Leave A Comment