ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
ఆరుగురి దుర్మరణం
గిద్దలూరు, విశాఖసమాచారం : ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీకొన్నాయి. కారులో 8 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. మృతులను బాపట్ల జిల్లా స్టూవర్టుపురం వాసులుగా గుర్తించారు. వీరంతా మహానంది పుణ్యక్షేత్రంలో దర్శనం చేసుకొని తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటికి తీశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.
Leave A Comment