పోలీసు కస్టడీకి నిందితులు
పోలీసు కస్టడీకి నిందితులు
విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు
విజయనగరం, విశాఖ సమాచారం: విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో నిందితులు సిరాజ్, సమీర్ను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విశాఖ జైలు నుంచి వారిని విజయనగరం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. నిందితులు విశాఖ జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్నారు. వారిని ప్రస్తుతం పోలీసులు విజయనగరంలోని పోలీసు శిక్షణ కళాశాలకు తీసుకొచ్చారు. ఇన్ఛార్జి ఎస్పీ మాధవరెడ్డి అక్కడికి చేరుకున్నారు. పేలుళ్ల కుట్ర గురించి వారిని విచారించనున్నారు.
సిరాజ్, సమీర్కు విజయనగరం ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఏడు రోజుల పోలీసు కస్టడీ విధించింది. గురువారం రాత్రి విజయనగరం పోలీసులకు కస్టడీ అనుమతుల పత్రాలు అందడంతో శుక్రవారం ఉదయాన్నే వారు విశాఖ జైలు వద్దకు చేరుకున్నారు.
Leave A Comment