తుని ఘటన కేసును తిరగదోడే ఉద్దేశం లేదు - తేల్చి చెప్పిన ఏపీ ప్రభుత్వం
తుని ఘటన కేసును తిరగదోడే ఉద్దేశం లేదు
- తేల్చి చెప్పిన ఏపీ ప్రభుత్వం
అమరావతి, విశాఖ సమాచారం: తుని ఘటనలో నమోదైన కేసును తిరగదోడే ఉద్దేశం లేదని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. కేసును కొట్టివేస్తూ రైల్వే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్కు వెళ్లే యోచన లేదని స్పష్టం చేసింది. తుని కేసును హైకోర్టులో అప్పీల్ చేయాలనే ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని అధికారులను ఆదేశించింది. విషయం ప్రభుత్వ పెద్దల దృష్టికి రాగానే అప్పీల్ ఆలోచన విరమించుకోవాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఏ స్థాయిలో ఆమోదంతో ఈ ఫైల్ నడిచిందనే అంశంపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. కేసుపై ఆర్పీఎఫ్ సీనియర్ డివిజినల్ సెక్యూరిటీ కమిషనర్ చేసిన ప్రతిపాదనల ఆధారంగా ఉత్తర్వులు వెలువడినట్లు అధికారులు గుర్తించారు. సున్నితమైన ఇలాంటి అంశాలపై అలసత్వాన్ని ఉపేక్షించేది లేదని అధికారులను ప్రభుత్వం హెచ్చరించింది. ప్రభుత్వ ఆదేశాలతో కొద్దిసేపట్లో జీవోను రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం.
Leave A Comment