• Login / Register
  • హోమ్

    తిరుమల శ్రీవారికి భారీ వెండి అఖండాలు విరాళం


    తిరుమల శ్రీవారికి భారీ వెండి అఖండాలు విరాళం

    తిరుమల, విశాఖ సమాచారం: తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత ప్రమోదాదేవి రెండు భారీ వెండి అఖండాలు (అఖండ దీపాలు)ను విరాళంగా అందజేశారు. రంగనాయకుల మండపంలో టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఆలయ అధికారులకు వాటిని అందించారు. ఒక్కో వెండి అఖండం సుమారు 50 కిలోల బరువు ఉంటుంది. 
    ఈ అఖండాలు శ్రీవారి గర్భగుడిలో వెలిగించే సంప్రదాయ దీపాలు. సుమారు 300 సంవత్సరాల క్రితం అప్పటి మైసూరు మహారాజు ఇలాంటి దీపాలను ఆలయానికి విరాళంగా అందించినట్లు చరిత్రలో ఉంది. శతాబ్దాల తర్వాత ఇప్పుడు మళ్లీ మైసూరు రాజమాత వాటిని సమర్పించడం విశేషం.

    Leave A Comment