• Login / Register
  • హోమ్

    కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

    కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 
    ఐదుగురి మృతి
      

    కడప, విశాఖ సమాచారం:  వైఎస్సార్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది.   ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. దీంతో, విషాదఛాయలు అలుముకున్నాయి. అందిన వివరాల ప్రకారం.. కడపలోని గువ్వల చెరువు ఘాట్‌ రోడ్డులో శనివారం ఉదయం లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి, ఒక పురుషుడు మృతిచెందారు. మృతులు బద్వేలు మండలం చింతపుత్తయ పల్లెకు చెందిన వారుగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన వారుగా నిర్ధారణ అయ్యింది. జాతర నేపథ్యంలో వీరంతా రాయచోటి నుంచి కడపకు వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.   ఎమ్మెల్సీ డీసీ గోవింద్‌ రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్‌ దాసరి సుధా ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. 
     వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి
     వైఎస్సార్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.   గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని,. మృతుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోలని కోరారు.

    Leave A Comment