అనంతపురంలో నిర్వహించిన “సూపర్ సిక్స్ – సూపర్ హిట్” సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. దసరా పండుగ కానుకగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్స్కు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించనున్నట్టు తెలిపారు.
వాహనమిత్ర పథకం కింద ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్స్కు రూ.15,000 ఆర్థిక సహాయం అందజేయనున్నారు. అదనంగా, వారి కుటుంబాలకు రూ.2.5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించారు.
ఈ పథకం ద్వారా ఆటో డ్రైవర్స్ కుటుంబాల ఆర్థిక భారం తగ్గించడమే కాక, ఆరోగ్య పరిరక్షణలో కూడా ఉపశమనం కలిగే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆటో డ్రైవర్స్ జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు.
ప్రజలు, ముఖ్యంగా ఆటో డ్రైవర్స్ వర్గం, ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.
Leave A Comment