అమరావతి:
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక వినూత్న
కార్యక్రమాన్ని చేపట్టింది. ఇంటి వద్ద నుంచే ప్లాస్టిక్ మరియు ఈ-వేస్ట్
సేకరించి, వాటిని కొనుగోలు చేసే విధానాన్ని త్వరలో అమలులోకి తీసుకురానుంది.
ప్రస్తుతం రాష్ట్రంలోని ఐదున్నర నగరాల్లో ఈ పథకం పైలట్ ప్రాజెక్ట్గా
పరీక్షల దశలో కొనసాగుతోంది.
“స్వచ్ఛాంధ్ర” పేరిట ఈ ప్రణాళికను అమలు చేయనున్నారు. గృహాలలో నిల్వ ఉండే ప్లాస్టిక్, వాడేసిన ఎలక్ట్రానిక్ పరికరాలు, మరియు ఇతర ఈ-వేస్ట్ను ప్రత్యేకంగా గుర్తించిన బృందాలు ఇంటివద్ద నుంచే సేకరిస్తాయి. సేకరించిన వస్తువులకు తగిన ధర చెల్లించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ఈ చర్య ద్వారా రాష్ట్రంలో ప్లాస్టిక్ కాలుష్యం తగ్గి, ఈ-వేస్ట్ సరైన రీతిలో రీసైకిల్ అవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రజల్లో పర్యావరణ అవగాహన పెంపొందించడంలో ఈ కార్యక్రమం కీలకపాత్ర పోషించనుంది.
👉 పర్యావరణ నిపుణులు ఈ పథకాన్ని స్వాగతిస్తూ, ఇతర రాష్ట్రాలకు ఇది ఒక ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు.
Leave A Comment