• Login / Register
  • ఆంధ్ర ప్రదేశ్

    20న స్టీల్‌ ప్లాంట్‌ కార్మికుల సమ్మె

    20న స్టీల్‌ ప్లాంట్‌ కార్మికుల సమ్మె 
     కాంట్రాక్ట్‌ కార్మికుల నిరవధిక సమ్మె ..  జేఏసీ మద్దతు
     అవసరమైతే మరో ప్యాకేజీ:   కేంద్ర మంత్రి
    విశాఖపట్నం, విశాఖ సమాచారం:   విశాఖ స్టీల్‌ ప్లాంట్‌  ఉద్యోగులు మంగళవారం ఒక్కరోజు సమ్మె చేసేందుకు సిద్ధం అవుతున్నారు. మరోవైపు కాంట్రాక్ట్‌ కార్మికులు కూడా నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. తొలగించిన కాంట్రాక్ట్‌ ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ 14 వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులు సమ్మెకు దిగనున్నారు.   కాంట్రాక్ట్‌ కార్మికుల సమ్మెకు ఉక్కు పోరాట కమిటీ మద్దతు పలికింది. కుట్రపూరితంగా కాంట్రాక్ట్‌ కార్మికుల తొలగింపు జరుగుతోందని.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు డిమాండ్‌ చేశారు.
    ఈ క్రమంలో  కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ   స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులది మాత్రమే కాదని.. ఆంధ్రా ప్రజలదని అన్నారు. అవసరం అయితే కేంద్ర ప్రభుత్వం   మరో ప్యాకేజ్‌ ఇవ్వడానికి సిద్ధమని పేర్కొన్నారు. కార్మికులు ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వంతో చర్చించాలని ఆహ్వానించారు. ఇప్పటికైనా సమ్మె ఆలోచనను కార్మికులు విరమించి ప్రభుత్వాలకు సహకరించాలని శ్రీనివాస వర్మ కోరారు.

    Leave A Comment