సైక్లోన్ మొంథా ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో వాతావరణ పరిస్థితులు విషమించాయి. భారీ వర్షాలు, గాలులు కారణంగా రైల్వే శాఖ అనేక రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. ముఖ్యంగా సికింద్రాబాదు–విశాఖపట్నం మార్గంలో నడిచే కొన్ని ముఖ్యమైన రైళ్లు షెడ్యూల్లో మార్పులు చేర్పులు చేయబడ్డాయి.
విశాఖ వైపు బయలుదేరిన ఒక రైలును, ప్రయాణికుల అభ్యర్థన మేరకు దువ్వాడ రైల్వే స్టేషన్లో నిలిపివేయడం జరిగింది. వర్షం తీవ్రత పెరగడంతో రైలు ముందుకు సాగడం సురక్షితం కాదని అధికారులు భావించారు. ఈ నిర్ణయాన్ని ప్రయాణికులు సానుకూలంగా స్వాగతించారు.
రైల్వే అధికారులు తెలిపారు ,తుఫాను కారణంగా మార్గంలో చెట్లు కూలడం, నీరు నిల్వ ఉండడం వంటి సమస్యల కారణంగా రవాణా అంతరాయం ఏర్పడిందని. పరిస్థితులు సాధారణం అయిన వెంటనే అన్ని రైళ్లు తిరిగి షెడ్యూల్ ప్రకారం నడుస్తాయని తెలిపారు.
ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు ఇండియన్ రైల్వేస్ వెబ్సైట్ లేదా రైల్వే హెల్ప్లైన్ నంబర్ల ద్వారా తాజా సమాచారం తెలుసుకోవాలని సూచించారు.
ప్రధానాంశాలు:
తుఫాను మొంథా ప్రభావంతో తీరప్రాంత రవాణా దెబ్బతింది
సికింద్రాబాదు–విశాఖ మార్గంలో రైళ్లు రద్దు
దువ్వాడలో రైలు ప్రయాణికుల అభ్యర్థనపై నిలిపివేత
రైల్వే శాఖ: పరిస్థితులు సాధారణమైతే రైళ్లు పునరుద్ధరణ
Subscribe to our newsletter to stay.
Leave A Comment