• Login / Register
  • విజయవాడ ‘సాక్షి’ కార్యాలయంపై దాడి

    విజయవాడ ‘సాక్షి’ కార్యాలయంపై దాడి

     విజయవాడ,  విశాఖ సమాచారం:  విజయవాడ ఆటోనగర్‌లోని సాక్షి కార్యాలయం వద్ద, టీడీపీ శ్రేణులు, అమరావతి మహిళలు ఆందోళనకు దిగారు. కార్యాలయం బోర్డును తొలగించారు. ఈ క్రమంలో సాక్షి యాజమాన్యం కార్యాలయం గేటుకు తాళాలు వేసింది. దీంతో మహిళా నేతలు గేటు ఎక్కి నిరసన తెలిపారు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల పట్ల జగన్‌, భారతి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.  సాక్షి కార్యాలయంలోకి కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. సాక్షి బోర్డులు పీకేసి తగులబెట్టారు. టిడిపి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సతీమణి అనురాధ తదితరులు పాల్గొన్నారు.
    మరోవైపు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో సాక్షి దినపత్రిక కార్యాలయం వద్ద మహిళలు ఆందోళన చేశారు. తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్‌, తెలుగు మహిళలు ఇందులో పాల్గొన్నారు. సాక్షి కార్యాలయం బోర్డును కూల్చి నిరసన తెలిపారు.
    మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తెలుగు మహిళలు గుంటూరులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అరండల్‌పేట సాక్షి కార్యాలయం వద్ద తెలుగు మహిళలు నిరసన తెలిపారు. నీచమైన వ్యాఖ్యలు మరోసారి చేయకుండా ఉండాలంటే వారికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు.

    Leave A Comment