• Login / Register
  • ఆంధ్ర ప్రదేశ్

    బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం

    బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం

    విశాఖపట్నం, విశాఖ సమాచారం: బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో పూర్తిగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో ఉత్తర కోస్తాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

    తెలంగాణలో..

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఈ నెల 26న మహబూబ్‌నగర్‌లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఇవి ఆదిలాబాద్ వరకు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

    Leave A Comment