అమరావతి:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు తక్కువ ధరలకు కూరగాయలు, నిత్యావసరాలు
అందించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 127 రైతుబజార్లకు అదనంగా 80 కొత్త రైతుబజార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఈ కొత్త బజార్లు ఏర్పాటుతో వినియోగదారులకు నేరుగా రైతుల నుండి సరుకులు తక్కువ ధరలకు లభిస్తాయని, మరోవైపు రైతులకు మధ్యవర్తుల జోక్యం తగ్గి అదనపు ఆదాయం లభిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మార్కెట్ ధరల అస్థిరత నేపథ్యంలో రైతుబజార్ల విస్తరణ ప్రజలకు, రైతులకు మేలు చేస్తుందని అధికారులు పేర్కొన్నారు. త్వరలోనే ఈ బజార్ల కోసం స్థలాల గుర్తింపు, మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు ప్రారంభం కానున్నాయి.
👉 ఈ నిర్ణయంతో రైతులు లాభపడటమే కాకుండా, నగర వినియోగదారులకు కూడా చౌకధరల్లో నాణ్యమైన కూరగాయలు అందుబాటులోకి రానున్నాయి.
Leave A Comment