• Login / Register
  • ఆంధ్ర ప్రదేశ్

    టీడీపీ ‘మహానాడు’కు 19 కమిటీలు

    టీడీపీ ‘మహానాడు’కు 19 కమిటీలు

     కడప వేదికగా ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు నిర్వహణ
    చరిత్రలో నిలిచిపోయేలా భారీ  ఏర్పాట్లు

    అమరావతి, విశాఖ సమాచారం: ‘మహానాడు’   నిర్వహణకు టీడీపీ 19 కమిటీలను నియమించింది. పార్టీలోని ముఖ్య నేతలతో కమిటీని ఏర్పాటు చేసింది. పల్లా శ్రీనివాస్‌, బక్కని నర్సింహులు ఆధ్వర్యంలో ఆహ్వాన కమిటీ.. నారా లోకేశ్‌ నేతృత్వంలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. యనమల ఆధ్వర్యంలో తీర్మానాలు, అచ్చెన్న నేతృత్వంలో వసతి ఏర్పాటు, రామ్మోహన్‌ నాయుడు ఆధ్వర్యంలో సభ నిర్వహణ, బీసీ జనార్దన్‌రెడ్డి నేతృత్వంలో భోజనాల కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో 10 నుంచి 20 మంది నేతలకు చోటు కల్పించారు.  

    భారీ ఏర్పాట్లు
      చరిత్రలో నిలిచిపోయేలా మహానాడును నిర్వహిస్తామని కడప జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్‌.సవిత వెల్లడిరచారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే క్యాడర్‌, నాయకుల కోసం అన్ని వసతులూ సిద్ధం చేశామన్నారు. ఈ నెల 27, 28, 28 తేదీల్లో కడపలోని పబ్బావరంలో నిర్వహించే టీడీపీ మహానాడు ఏర్పాట్లపై   నిర్వహించిన సన్నాహాక సమావేశంలో  మంత్రి  మాట్లాడారు. జిల్లా ఇన్చార్జి మంత్రిగా తన ఆధ్వర్యంలో టీడీపీ మహానాడు నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. గతంలో నిర్వహించిన మహానాడు కంటే చరిత్రలో నిలిచిపోయేలా కడప మహానాడును నిర్వహించడానికి కడప నాయకులు, కార్యకర్తల సమన్వయంతో, ఐక్యమంతో పనిచేస్తున్నారన్నారు. మూడో రోజుల పాటు నిర్వహించే మహానాడు కోసం అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేశామన్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుకుండా రాకపోకలకు వీలుగా రూట్‌ మ్యాప్‌ రెడీ చేశామన్నారు.  

    5 లక్షల మంది వచ్చే అవకాశం
    44వ టీడీపీ మహానాడుకు అయిదు లక్షల మంది క్యాడర్‌ వచ్చే అవకాశముందని  మంత్రి సవిత తెలిపారు. రాయలసీమ నుంచి మూడు లక్షల వరకూ జన సమీకరణ చేపడుతున్నట్లు తెలిపారు. కడపలో మహానాడు నిర్వహణకు నిర్ణయించిన సీఎం చంద్రబాబుకు   ధన్యవాదాలు తెలిపారు.   టీడీపీతోనే రాయలసీమ అభివృద్ధి సాధ్యమవుతుందని,  మహానాడు వేదికగా రాయలసీమ అభివృద్ధికి సీఎం చంద్రబాబు  మరిన్ని వరాలు కురిపించే అవకాశముందని చెప్పారు.

    Leave A Comment