• Login / Register
  • ఆంధ్ర ప్రదేశ్

    ఒత్తిడిని అధిగమించాలంటే యోగా తప్పనిసరి: సీఎం

    ఒత్తిడిని అధిగమించాలంటే యోగా తప్పనిసరి: సీఎం 

    కడప: అభివృద్ధి చెందిన దేశాల్లోనూ యోగా వారి జీవితాల్లో భాగమైందని  సీఎం చంద్రబాబు  అన్నారు. ఎంతోమంది మన దేశానికి వచ్చి యోగా నేర్చుకుని తమ దేశాల్లో అమలు చేస్తున్నారని చెప్పారు. కడపలో రెండో రోజు మహానాడులో సీఎం మాట్లాడారు. 
    ‘‘ఒత్తిడిని అధిగమించాలంటే యోగా తప్పనిసరి. మే 21 నుంచి జూన్‌ 21 వరకు యోగా నెలగా నిర్వహిస్తున్నాం. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌ నుంచి భీమునిపట్నం వరకు 25కి.మీ పరిధిలో 5 లక్షల మందితో యోగా చేయబోతున్నాం. ఒకే ప్రాంతంలో 5లక్షల మందితో ఇలా చేయడం గిన్నిస్‌ రికార్డు కాబోతోంది. ఆరోజు రాష్ట్రం మొత్తం 2 కోట్ల మంది యెగా చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నాం. కనీసం 20 లక్షల మంది యోగా సర్టిఫికేషన్లు తీసుకోవాలి. ఏకాగ్రత పెంచుకునేందుకు అందరూ చేయాలి. యోగాపై మంచి పాట రాస్తే బహుమతి ఇస్తాం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

    Leave A Comment